ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు ఉగ్రసేనుని రాజ్యభారమును వహింపఁ జెప్పుట
అనిభక్తి నూరార్చి యయ్యుగ్రసేనుఁ
గనుఁ గొని కౌఁగిటగదియించి, శౌరి
“నీరాజ్యమంతయు నిర్దయవృత్తిఁ
గ్రూరుఁడై తానెకైకొని యంతఁబోక
యాకలఁబెట్టి మి మ్మలఁచిన యతఁడు
కాకున్న పనియట్లగాక పోరాదు
హీనమానసులైన యీదురాత్ములకుఁ
గానఁ జింతింపకఁ గంసాదిసుతుల
కగ్ని సంస్కారాదులర్థిఁ జేయింపు
ప్రాజ్ఞుల విప్రులఁ బనిచి వేవేగ
రాజ్యభారముఁ దాల్చి రమణ మాకెల్ల
పూజ్యుఁ డవై లీల భూమిపాలింపు”,
మనుటయు హరిఁ జూచి యయ్యుగ్రసేనుఁ
“డనఘ! నన్నిమ్మాటలాడఁగఁ దగునె?
హీనుఁడ నతివృద్ధ నీరాజ్యభరము
పూన నా కర్హంబె? పుండరీకీక్ష!
వసుదేవుఁ బట్టంబు వలనొప్పఁ గట్టి
యసమానగతిని రాజ్యము నీవెతీర్పు; - 280
కన్నులు చల్లఁగాఁ గలకాలమెల్ల
నిన్నుఁ జూచుచుఁ బ్రీతి నెగెడద కృష్ణ!”
అనుచుఁ బల్కిన శౌరి యారాజుఁ జూచి
వినయంబు నీతియు వెలయ నిట్లనియె.
“యాదవులకు రాజ్య మర్హకృత్యములు
గాదు యయాతి వాక్యముఁ ద్రోయరాదు;
కావున సామ్రాజ్య కమనీయలక్ష్మి
నీవె పాలించి మన్నించు, బాంధవుల
రప్పించి వారికి రాజ్యంబులిచ్చి
తప్పక మమ్మెల్ల దయనేలుకొనుము.
నిఖిల భూపతులును నింపుసేయంగ
సుఖలీలనుండు; కంసుని వంతమాను”,
మని పల్కి యాతని నవనీభరంబుఁ
గొనకొనుమని నీయకొలిపి మురారి